• కరీంనగర్ గుండెల్లో గన్ శబ్దాలు

    SM_కరీంనగర్ గుండెల్లో గన్ శబ్దాలు

    SM-Karimnagar news: కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన సంచలన ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి అత్యంత సమీపంలో ఉన్న పీఎంజే జువెల్లర్స్‌లో ఏడుగురు దుండగులు పట్టపగలే దోపిడీకి పాల్పడి కాల్పులు జరపడం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. జిల్లా జడ్జి క్వార్టర్స్ వెనుక వైపున జరిగిన ఈ దారుణ ఘటనలో దుండగులు ముందుగా షాపులోకి చొరబడి సిబ్బంది, అక్కడ ఉన్న వారిని బెదిరించి బంగారం ఎత్తుకుపోయినట్లు తెలుస్తోంది. అనంతరం అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనలో అత్యంత సంచలన విషయం ఏమిటంటే.. దోపిడీ జరిగిన ప్రాంతానికి కేవలం అరగంట ముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి వెళ్లినట్లు సమాచారం. అంటే ఘటన స్థల పరిసరాల్లో అప్పుడు భద్రతా బందోబస్తు కూడా ఉన్నట్టే. అయినప్పటికీ దుండగులు ఇంత పెద్ద సాహసానికి దిగడం పోలీసు వ్యవస్థకు సవాల్‌గా మారింది. ఇంకా ముందురోజే రాత్రి పోలీసులు నగరంలో నాకాబందీ నిర్వహించినట్లు తెలుస్తోంది. చెక్‌పోస్టులు, గస్తీ చర్యలు ఉన్నప్పటికీ మరుసటి రోజే నగర మధ్యలో ఈ తరహా కాల్పులు, దోపిడీ జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. నేరస్తులు ముందుగానే రేకీ నిర్వహించి పక్కా ప్రణాళికతో వచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన అనంతరం దుండగులు వేగంగా అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. కోర్టు వెనుక లైన్ ప్రాంతంలో ఒక మ్యాగజైన్ లభ్యమైనట్లు తెలిసింది. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు, ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నగరమంతా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, బయటకు వెళ్లే మార్గాలన్నింటిని మూసివేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను సేకరించి నిందితుల కదలికలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనతో కరీంనగర్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేంద్ర మంత్రి ఇంటి సమీపంలోనే దుండగులు కాల్పులు జరిపి దోపిడీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. భద్రతా వైఫల్యంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

    SM_తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

    SM-రంగారెడ్డి జిల్లా news: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం అయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఎల్లుండి పదవీ విరమణ చేయగా.. ఆ తర్వాత సీవీ ఆనంద్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్ ఇప్పటివరకు పలు హోదాల్లో పనిచేశారు.అంతా అనుకున్నట్లుగానే తెలంగాణ డీజీపీ పదవి సీవీ ఆనంద్‌కు దక్కింది. తెలంగాణ తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీవీ ఆనంద్‌ను నియమిస్తూ.రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెలాఖరున ప్రస్తుత డీజీపీ శివధర్‌‌రెడ్డి ఉద్యోగ విరమణ చేయనుండగా.. ఆ తర్వాత ఆ స్థానంలోకి ఎవరు వస్తారా.రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కొత్త డీజీపీగా నియమిస్తుంది అనేది గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. తాజాగా ఆ ఉత్కంఠకు తెరపడింది. కొత్త పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు.. కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ను నియమిస్తున్నట్లు మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్ .. సీనియారిటీ పరంగా చూస్తే. డీజీపీ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న సీవీ ఆనంద్‌కు క్షేత్రస్థాయిలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన అనుభవం ఉంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వహణలో సీవీ ఆనంద్‌కు ఉన్న పట్టు, ఆయన ఇమేజ్‌ను సహా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయనకు డీజీపీ బాధ్యతలు కట్టబెట్టింది.గతంలో హైదరాబాద్‌ సీపీగా, ఏసీబీ డైరెక్టర్‌గా సీవీ ఆనంద్ ఎన్నో విజయాలు అందుకున్నారు. సీవీ ఆనంద్ పనితీరుపై సంతృప్తిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.రాష్ట్ర శాంతి భద్రతల బాధ్యతలను అప్పగించడం ద్వారా పోలీస్ శాఖలో మరింత క్రమశిక్షణను పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్‌ ‌రెడ్డి త్వరలోనే పదవీ విరమణ పొందనున్నారు. ఈ నెలాఖరున డీజీపీ శివధర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు చెప్పేందుకు ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఈనెల 30వ తేదీన డీజీపీగా శివధర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆ తర్వాతి రోజే అంటే మే 1వ తేదీన కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతలు తీసుకోనున్నారు.ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను ఐసీసీసీ (ICCC)లో మర్యాదపూర్వకంగా కలిసిన కొత్త డీజీపీ cv ఆనంద్.
    అధికారికంగా అభినందనలు తెలియజేసిన ముఖ్యమంత్రి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై చర్చ. పోలీస్ శాఖ బలోపేతం, టెక్నాలజీ వినియోగంపై ఫోకస్. భద్రతా వ్యవస్థ మరింత పటిష్టం చేయాలని సూచనలు.

  • స్వయం ఉపాధి పొందుతూ, ఆర్థికంగా ఎదగాలి

    SM_స్వయం ఉపాధి పొందుతూ, ఆర్థికంగా ఎదగాలి

    SM-Sircilla news:జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో అందజేసిన కుట్టు మిషన్లను మహిళలు సద్వినియోగం చేసుకొని.. ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్టైల్ పార్కులో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన మహిళలకు కుట్టు శిక్షణ కొనసాగుతుండగా, జిల్లా కలెక్టర్ సోమవారం పరిశీలించారు. కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజులుగా శిక్షణ పొందుతున్నారు? శిక్షణలో ఏ ఏ మెలుకువలు అందిస్తున్నారు అనే అంశాలపై ఆరా తీశారు. వారిలో నిరుపేదలకు కుట్టు మిషన్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన రామిడి లక్ష్మి, బత్తిని అశ్విని, పోతూరి లావణ్య, దొరగళ్ల ప్రేమలత, పోతూరి నిర్మల, మంద సుమలతకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం కుట్టు మిషన్లను జిల్లా కలెక్టర్ అందజేశారు. అనంతరం కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ… కుట్టు మిషన్లను మహిళలు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని సూచించారు. ఇటీవల చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో అందించిన శిక్షణలో మెలకువలు వినియోగిస్తూ, యూనిఫాంలు, ఇతర డ్రెస్సులు, ఆధునిక డిజైన్లతో డ్రెస్సులు కుట్టాలని పేర్కొన్నారు. ఆర్థికంగా రాణించి మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ సంతోష్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

  • గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 36 ఫిర్యాదులు స్వీకరణ:జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

    SM_గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 36 ఫిర్యాదులు స్వీకరణ:జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

    SM-Sircilla news: ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 36 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.

  • శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

    రాజన్న సిరిసిల్ల జిల్లా: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు.ఈవేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే హాజరై శ్రీ వాసవి మాత చిత్ర పటానికి పుష్పమాల వేశారు.

    కార్యక్రమంలో ఆర్.ఐ యాదగిరి, ఎస్.ఐ కిరణ్ కుమార్, ఆర్.ఎస్.ఐ సాయి కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.

  • కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

    SM_కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

    SM-హైదరాబాద్ న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో భారీ కలకలం రేపే పరిణామంగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ వేదికను ప్రకటిస్తూ “తెలంగాణ రాష్ట్ర సేన”గా నామకరణం చేశారు. ఆవిర్భావ సభలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ముఖ్యంగా “గుంటనక్క చేతిలో కేసీఆర్ఆయన మన మనిషి కాదు, మరమనిషి” అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సభలో కవిత తన రాజకీయ దిశను స్పష్టంగా తెలియజేస్తూ, “ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం” అని ప్రకటించారు. మార్పు కోసం పోరాటం తప్పనిసరి అయిందని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం జరగాలంటే కొత్త రాజకీయ శక్తి అవసరమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అధికారాలు, హామీలు ఉన్నప్పటికీ సామాజిక న్యాయం పూర్తి స్థాయిలో అందలేదని విమర్శించారు. పార్టీ ఆవిర్భావం అనంతరం అభిమానుల మధ్యకు వచ్చిన కవితకు భారీ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అభిమానులు అందించిన గాజుల గంపను ఆమె తలపై పెట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యం మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిందని, సంప్రదాయం, భావోద్వేగం కలిసిన క్షణంగా మారిందని అక్కడి నాయకులు పేర్కొన్నారు. ఇక రాబోయే ఎన్నికలపై కూడా కవిత కీలక ప్రకటన చేశారు. వచ్చే GHMC, MPTC, ZPTC ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రజల్లోకి వెళ్లి తమ బలం నిరూపించుకుంటామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు తమ పార్టీ విస్తరించబోతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యమని, ప్రజల ఆశయాలు, ముఖ్యంగా బలహీన వర్గాల హక్కులు సాధించడమే తమ ప్రధాన అజెండా అని చెప్పారు. మహిళలకు గౌరవం, యువతకు అవకాశాలు, రైతులకు భరోసా, కార్మికులకు న్యాయం అందించే విధంగా తమ పార్టీ పని చేస్తుందని తెలిపారు. కవిత చేసిన ఈ ప్రకటనలతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు సంప్రదాయ ప్రతిపక్షాల మధ్య కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ రాష్ట్ర సేన ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కవిత కొత్త పార్టీతో ముందుకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ పార్టీ చర్యలు, ప్రజల స్పందన ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

  • వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

    SM_వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

    SM- Vemulawada news: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం ఐపీఎస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీజీపీ ఆలయ వసతి గృహానికి చేరుకున్న వెంటనే పోలీస్ బృందం గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) సమర్పించింది. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచకంతో ఘనంగా స్వాగతం పలికారు. తరువాత స్వామివారి మండపంలో అర్చకులు వేద పండితులు తీర్థ ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ డీఈఓ భాస్కర శర్మ స్వామివారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని డీజీపీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, ఆలయ ఏఈఓ జి.అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.